డా. M .F . గోపీనాథ్ M D D M
Total Pageviews
Saturday, September 3, 2011
అసమ్మతి తయారీ కార్ఖానా
80 కోట్ల జనాభా సమస్య ఆహార భద్రత విషయంలోను, ఆదివాసీల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న ఆపరేషన్ గ్రీన్హంట్ విషయాన్ని పట్టించుకోని అన్నాజీ, భారత ప్రజల మెస్సయ్య ఎలా అవుతాడు? తెలంగాణ యువకుల ప్రాణత్యాగాల్ని పట్టించుకోని ఈ దేశ మీడియా, ప్రజల్ని మాస్ హిస్టీరియోకెందుకు ఉసిగొల్పుతోంది? అణచివేయబడుతున్న కులాలు, విద్యార్ధులు, మేధావులు ఆలోచించాలి!
అవినీతికి పాల్పడేవారికే, నీతి గురించి మాట్లాడే అవసరం ఎక్కువగా వుంటుంది. వీళ్ళే 'నీతిని' ఎక్కువగా ప్రేమిస్తారు. ఎందుకంటే 'నీతి' వీళ్ళకి అందని ద్రాక్ష. నిత్యజీవితంలో నీతికి కట్టుబడి ఉండటం వీళ్ళ వృత్తికి, ప్రవృత్తికి వ్యతిరేకం. కనుక సాఫ్ట్ స్కిల్స్, అపర గాంధీగారి ఆచ్ఛాదన ఉన్న హజారేగారిని వెదికి, వేదిక నెక్కించి జాతర జరిపిస్తే జనంలో కలిసిపోవచ్చు అనే ఉపాయానికి అనుగుణంగా, హైటెక్ హంగులతో రామ్లీలా మైదానంలో "ది గ్రేట్ ఇండియన్ సర్కస్''ని ప్రారంభించింది.
ఈ సర్కస్లో సూత్రధారులు, పాత్రధారులు ఎవరు? దళిత, ఆదివాసీ, ముస్లిమ్, ఒబిసి వ్యతిరేకులు. బాబ్రీ మసీదు కూల్చివేతను, గ్రాహం స్టెయిన్స్ సజీవదహనాన్ని, గుజరాత్ గాయాల్ని, ఖైర్లాంజీ కిరాతకాన్ని, బెల్చి సజీవదహనాల్ని దైవ సమ్మత కార్యాలుగా నిర్వహించిన పవిత్ర సనాతన ధర్మరక్షకులేనన్నది తిరుగులేని వాస్తవం. అయితే అన్నా టీం ప్రశాంత్భూషణ్, అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కిరణ్బేడీ, స్వామి అగ్నివేష్, బాబా రామ్దేవ్, మేధాపాట్కర్లు సనాతన ధర్మరక్షకులు అంటే ఈ లోకం నమ్మదు.. ఎందుకంటే వాళ్ళకున్న బహిర్గత ప్రజామోదం, నాగరికత, పాజిటివ్ థింకింగ్ లాంటి గుణగణాలన్నీ ఇండియన్ మేధావి వర్గాన్నే అబ్బురపరుస్తాయి.
మండల్ కమిషన్ను వ్యతిరేకించిన ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య విద్యార్థులకు ఈ సనాతన ధర్మరక్షకులే ఇన్స్పిరేషన్. అన్నా దీక్షా శిబిరంలో ఆగస్టు 23న జరిగిన రెండు సంఘటనలు ఇందుకు సందర్భ సాక్ష్యంగా నిలుస్తాయి.
అవి (1) అన్నా హజారే దీక్షకు మద్దతు పలుకుతూ, కల్చరల్ ప్రోగ్రాం యివ్వటానికి అక్కడికి చేరిన లిబరేషన్ గ్రూప్ని (యం.యల్.పార్టీ) రామ్లీలా మైదానం నుండి తరిమేసారు.
(2) అదే దీక్షా శిబిరం నుండి అన్నా మద్దతుదార్లు 'ఆరక్షణ్' సినిమాకి మద్దతుగా, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. ఇంతకన్నా యింకేమి సాక్ష్యం కావాలి, అన్నా టీం అసలు ఉద్దేశాలు, ప్రణాళికలు అర్థం చేసుకోటానికి? అసలు 'అవినీతి' అంటే ఏమిటి? లంచగొండితనమే అవినీతా? రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకి లాభదాయకమైన ధర నిర్ణయించకుండా, గిట్టుబాటు ధర నిర్ణయించటం, పారిశ్రామిక వేత్తకి తన సరకు ధర తాను నిర్ణయించుకునే హక్కునివ్వటం, ప్రభుత్వాల చట్టబద్ధ అవినీతి కాదా? గ్రామ స్వరాజ్యం గురించి మాట్లాడే మన అపర గాంధీగారు తన ప్రాంతంలోని రైతుల ఆత్మహత్యల గురించి ఏనాడైనా రిలే నిరాహార దీక్ష అయినా చేసాడా? అవినీతి పెరిగిపోతున్నమాట వాస్తవం.
దానికి కారణమైన దోపిడీని, ఒక కల్చర్గా, కళగా అభివృద్ధి చేసిందెవరు? చాతుర్వర్ణ వ్యవస్థలో అగ్రభాగాన ఉన్న ప్రాబల్య కులాలు కాదా? వేల, లక్షల కోట్ల అవినీతికి పాల్పడే మైనింగ్ మాఫియాని, రాజకీయ కుబేరుల్ని, 10 రూపాయలు లంచం తీసుకొనే ట్రాఫిక్ కానిస్టేబుల్ని అవినీతిలో ఒకేగాటన కట్టటంలో ఉన్న నీతి ఎంత? అన్నా హజారే బృందానికి, సంఘ్ పరివార్ గ్రీన్ రూమ్ ఆపరేటర్స్కి 'అవినీతి' అనే తేలికపాటి ఆయుధం ఎందుకు అవసరమొచ్చింది? మల్టీనేషన్ కంపెనీలకు ఈ శతాబ్ధారంభంలో వరల్డ్ సోషల్ ఫోరమ్ని ఆరంభించవలసిన ఆగత్యమెందుకొచ్చిందో, ఈ దేశంలోని దోపిడి పాలక కులాలకు "అవినీతి వ్యతిరేక పోరాటమనే'' ఆయుధం అందుకే అవసరమొచ్చింది.
ప్రపంచీకరణకు ప్రత్యామ్నాయం లేదన్న మార్కెట్ వేదాన్ని, నినాదంగా మార్చినవాళ్ళే మార్కెట్ శక్తుల్ని ఎదుర్కొంటామని నమ్మబలికి ప్రపంచ సామాజిక వేదిక (వరల్డ్ సోషల్ ఫోరమ్) 21వ శతాబ్దారంభంలో ఏర్పాటు చేశారు. అది సగటు ఆశావాదికి సగటు ఆనందాన్ని కలిగించింది. 2004లో హైద్రాబాద్ (ఇండియా) ప్రపంచ సామాజిక వేదిక జరిపిన రెండు రోజుల సదస్సులో ఏఏ శక్తుల్ని ముందుంచి, ఏఏ శక్తులు వెనకుండి నడిపాయో, అర్ధమయ్యే నాటికి అవాక్కయ్యింది బాధ్యతాయుత పౌరసమాజం.
ప్రపంచీకరణ, సరళీకరణ మూడవదశలో చేరేందుకు సన్నద్ధమౌతున్న ప్రస్తుత తరుణంలో వరల్డ్బ్యాంక్, ఐ.యం.యఫ్ లాంటి పెట్టుబడిదారీ సంస్థలకు ఎన్జీవోల వంటి 'సమ్మతి తయారీ ఫ్యాక్టరీలు' అణగారిన జనాన్ని ఆశించినంతగా ప్రభావితం చేయలేకపోతున్నాయని గుర్తించారు. కొత్త ఫార్ములా వెదికారు. ఆ ఫార్ములానే మైఖేల్ చోసుదొ వస్కీ నిర్వచించిన మ్యానుఫాక్చరింగ్ డిసెంట్ (అసమ్మతి తయారీ) సిద్ధాంతం.
అంటే విద్యార్థులు తమ న్యాయమైన డిమాండ్ల కొరకు శాంతియుత ఊరేగింపులు తీస్తుంటే ప్రభుత్వ పెద్దలే అందులో చేరి వారికి నాయకత్వం వహిస్తున్నట్లు నటించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలిస్తూ చివరకు ఆ ఉద్యమాన్ని నీరుగార్చటం; 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని మర్రి చెన్నారెడ్డి వంటి వారు, హైజాక్ చేసి చివరకు పదవులు తీసుకొని ఉద్యమాన్ని చల్లార్చటం; రాజకీయ పార్టీలు, ఎస్.సి.సెల్, బి.సి. సెల్, ఎస్.టి. సెల్, మైనారిటీ సెల్ పెట్టి ఆయావర్గాల్లో వస్తున్న చైతన్యానికి అడ్డుకట్ట వేయించే కుతంత్రాలకి పాల్పడటం; దోపిడికి గురయ్యే వర్గాల తరపున దోపిడికి పాల్పడే వర్గాలు ముందుగానే దోపిడీకి వ్యతిరేకంగా ఊరేగింపులు, ధర్నాలు, నిరాహార దీక్షలు చేయటం ప్రారంభించి కంటితుడుపు చట్టాల్ని, అగ్రిమెంట్లని చేసి అసలు సమస్యను పక్కదోవ పట్టిస్తారు.
ఈ రోజు 'అవినీతి' అనే అంశాన్ని అందరూ అసహ్యించుకొనే స్థాయికి పెంచింది వీళ్ళే. దాన్నే ఆయుధంగా మార్చుకొని, అన్నా హజారే లాంటి గాంధేయ వాదిని రాలేగాంసిద్ధి గ్రామ జమ్మిచెట్టు నుండి దించి రాంలీలా మైదానంలో ప్రదర్శనకి పెట్టారు. 600 మందికి పైగా తెలంగాణ విద్యార్ధి యువకులు చనిపోతున్నా నోరెత్తని అన్నాజీ, ఖైర్లాంజీ కిరాతకాన్ని పట్టించుకోని గాంధేయుడు, అరుంధతీరాయ్ అన్నట్లు, మైనింగ్ మాఫియా గురించి గాని, సెజ్ల గురించి గానీ, గ్రీన్ హంట్లో ఆదివాసీల్ని అంతంచేస్తున్నపుడుగాని, సింగూర్, నందిగ్రాం ఉద్యమాలనుగాని, పోలవరం, నర్మదా డ్యాంలకు వ్యతిరేకంగా ప్రజాందోళనల్నిగాని పట్టించుకోని అన్నాజీ, రాలేగాం సిద్ధి చుట్టుపక్కల గ్రామాల్లో అందరి ఇళ్లలో సావర్కర్, ఫోటోలను పెట్టించే విప్లవాత్మక కార్యక్రమాన్ని, అమలుచేస్తూ అపర సంఘపరివార్ అనధికార సుప్రీంలా భారత రాజకీయ చిత్రపటం మీదికి అదాటుగా ఎలా వచ్చాడనేది అంత రహస్యమేమి కాదు.
జనలోక్పాల్ బిల్లు గురించి ప్రధానమంత్రిని బిల్లులో ఉంచాలా లేదా అన్నది అసలు సమస్యేనా? ఈ రోజు పి.యం.ఓ., సి.యం.ఓ., పార్లమెంటుని కూడా ప్రభావితం చేయగలిగే శక్తి కార్పొరేట్ సంస్థలకున్నదన్న విషయం అన్నాజీకి ఆయన భజన బృందానికి తెలియదా? భారత్లోనే మినీ భారత్లను సృష్టించుకుని, చట్టాల కతీతంగా దోపిడీ కొనసాగిస్తూ, అణు ఒప్పందంలో ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులకు ఒక్కొక్కరికి 30-40 కోట్ల రూపాయలు లంచంగా యిచ్చి ఇండియాని అమెరికాకు తాకట్టు పెట్టే బిల్లును నెగ్గించుకున్నప్పుడు అంత మొత్తం డబ్బుని ఏఏ కార్పొరేట్ శక్తులు సమకూర్చాయో ఈ గాంధేయ రుషికి తెలియదా? కిరణ్బేడి బెహన్జీకి, అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కార్పొరేట్ డాక్టర్ ట్రెహన్లకు తెలియదా?
అన్నింటికన్నా ముఖ్యమైన రెండు విషయాలు ఆలోచించాల్సినవి.
(1) రెండు నెలల క్రితమే రామ్లీలా మైదానంలో సెప్టెంబర్ 1వ తారీకున బామ్సెఫ్ (బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్), ఒబిసి జనాభా లెక్కల విషయంలో జరుగుతున్న జాప్యానికి వ్యతిరేకంగా పెద్ద ర్యాలీని తలపెట్టి ప్రభుత్వ అనుమతి పొందింది. అదే రామ్లీలా మైదానాన్ని, అన్నాకు సెప్టెంబర్ 3 వరకు ప్రభుత్వం ఎందుకు అప్పగించింది? ఒబిసి సెన్సస్ విషయంలో అన్నా టీం స్పందన ఏమిటి?
(2) రామ్లీలా మైదానంలో రిజర్వేషన్ వ్యతిరేక నినాదాలు ఎందుకు, ఎవరిచ్చారు? గుజరాత్లో ముస్లిములను ఊచకోత కోసినపుడు మాట్లాడని అన్నాబృందం, మండల్ కమిషన్ని వ్యతిరేకించిన ఆధునిక మనువాదులు, వేదాంత, పోస్కోలాంటి మల్టీనేషన్ మైనింగ్ మాఫియాని వ్యతిరేకించని మినీభారత్ నిర్మాతలు, 'అవినీతి' అనే అంశాన్ని తీసుకొని కాషాయ కూటమికి అనుకూలంగా, మైనార్టీలకు వ్యతిరేకంగా ఒక సైన్యాన్ని ఎందుకు తయారుచేస్తున్నట్లు? రాజ్యాంగేతర వ్యవస్థని ఎందుకు కోరుతున్నట్లు? 80 కోట్ల జనాభా సమస్య ఆహార భద్రత విషయంలోను, ఆదివాసీల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న ఆపరేషన్ గ్రీన్హంట్ విషయాన్ని పట్టించుకోని అన్నాజీ, భారత ప్రజల మెస్సయ్య ఎలా అవుతాడు? తెలంగాణ యువకుల ప్రాణత్యాగాల్ని పట్టించుకోని ఈ దేశ మీడి యా, ప్రజల్ని మాస్ హిస్టీరీయోకెందుకు ఉసిగొల్పుతోంది.
అణచివేయబడుతున్న కులాలు, విద్యార్ధులు, మేధావులు ఆలోచించాలి!
అన్నాటీం ఈ అంశాలకు జవాబు చెప్పాల్సి ఉంది. (1) దేశంలో అవినీతికి పాల్పడుతున్నది ఏఏ వర్ణాలు / కులాలు? (2) స్విస్బ్యాంకుల్లో లక్షల కోట్ల రూపాయలు దాచింది ఏఏ కులవర్గాలు? (3) నూటికి 90 శాతంగా ఉన్న శ్రామిక కులాలు అవినీతికి బాధ్యులా? లేక నూటికి 10 శాతంగా కూడాలేని దోపిడీ కులాలు అవినీతికి బాధ్యులా? (4) తమ చుట్టూ ఉన్న కార్పొరేట్ మీడియా, కార్పొరేట్ సంస్థలు, రాజకీయ నాయకులు అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనటానికి అర్హులేనా? (5) మండల్ కమిషన్కి వ్యతిరేకంగా రిజర్వేషన్లకి వ్యతిరేకంగా నినదించిన ఈ గొంతులే కదా దొంగ, దొంగ అని అరుస్తున్నది. (6) ఒక అవినీతి సామ్రాజ్యానికి వ్యతిరేకంగా, యింకో అవినీతి సామ్రాట్టు నినదించటంలోని రహస్యం అసలైన అవినీతి పరులు బయట పడకుండా ఉంచటానికేనా? అడాల్ఫ్ హిట్లర్ తాను యుద్ధంలో ఓడిపోతున్న విషయం రూఢి అయిన తర్వాత ఆత్మహత్యకు సిద్ధం అవుతాడు.
ఆ చివరి క్షణాలలో ఇంగ్లాండ్ ప్రీమియర్కు, అమెరికన్ ప్రెసిడెంట్కు ఒక వర్తమానం పంపుతాడు. ఆ వర్తమాన మేమంటే "నేను మీకు (పెట్టుబడి దారులకు) చేసే చివరి సేవ ఒక్కటే! మీరు ఇప్పటికైనా యుద్ధంలో చురుకుగా పాల్గొని కమ్యూనిస్టుల నుండి యూరప్ను రక్షించండి''. అన్నాజీ! 74 సంవత్సరాల వయస్సులో కూడా నమ్మిన మనువాద గాంధీ సిద్ధాంతానికి అంకితమై ప్రాణత్యాగానికి సిద్ధమైన మీ దీక్షా దక్షతలకు జోహార్లు! మీ వెన్నంటి ఉన్న అపర కుబేరులకు జేజేలు!! మీ దీక్షా దక్షతలను కనీసం 100 కోట్ల పౌరులకు బట్వాడా చేసిన కార్పొరేట్ మీడియాకు వేల వేల దండాలు!!!
- డా.యం.యఫ్. గోపీనాథ్
అవినీతికి పాల్పడేవారికే, నీతి గురించి మాట్లాడే అవసరం ఎక్కువగా వుంటుంది. వీళ్ళే 'నీతిని' ఎక్కువగా ప్రేమిస్తారు. ఎందుకంటే 'నీతి' వీళ్ళకి అందని ద్రాక్ష. నిత్యజీవితంలో నీతికి కట్టుబడి ఉండటం వీళ్ళ వృత్తికి, ప్రవృత్తికి వ్యతిరేకం. కనుక సాఫ్ట్ స్కిల్స్, అపర గాంధీగారి ఆచ్ఛాదన ఉన్న హజారేగారిని వెదికి, వేదిక నెక్కించి జాతర జరిపిస్తే జనంలో కలిసిపోవచ్చు అనే ఉపాయానికి అనుగుణంగా, హైటెక్ హంగులతో రామ్లీలా మైదానంలో "ది గ్రేట్ ఇండియన్ సర్కస్''ని ప్రారంభించింది.
ఈ సర్కస్లో సూత్రధారులు, పాత్రధారులు ఎవరు? దళిత, ఆదివాసీ, ముస్లిమ్, ఒబిసి వ్యతిరేకులు. బాబ్రీ మసీదు కూల్చివేతను, గ్రాహం స్టెయిన్స్ సజీవదహనాన్ని, గుజరాత్ గాయాల్ని, ఖైర్లాంజీ కిరాతకాన్ని, బెల్చి సజీవదహనాల్ని దైవ సమ్మత కార్యాలుగా నిర్వహించిన పవిత్ర సనాతన ధర్మరక్షకులేనన్నది తిరుగులేని వాస్తవం. అయితే అన్నా టీం ప్రశాంత్భూషణ్, అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కిరణ్బేడీ, స్వామి అగ్నివేష్, బాబా రామ్దేవ్, మేధాపాట్కర్లు సనాతన ధర్మరక్షకులు అంటే ఈ లోకం నమ్మదు.. ఎందుకంటే వాళ్ళకున్న బహిర్గత ప్రజామోదం, నాగరికత, పాజిటివ్ థింకింగ్ లాంటి గుణగణాలన్నీ ఇండియన్ మేధావి వర్గాన్నే అబ్బురపరుస్తాయి.
మండల్ కమిషన్ను వ్యతిరేకించిన ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య విద్యార్థులకు ఈ సనాతన ధర్మరక్షకులే ఇన్స్పిరేషన్. అన్నా దీక్షా శిబిరంలో ఆగస్టు 23న జరిగిన రెండు సంఘటనలు ఇందుకు సందర్భ సాక్ష్యంగా నిలుస్తాయి.
అవి (1) అన్నా హజారే దీక్షకు మద్దతు పలుకుతూ, కల్చరల్ ప్రోగ్రాం యివ్వటానికి అక్కడికి చేరిన లిబరేషన్ గ్రూప్ని (యం.యల్.పార్టీ) రామ్లీలా మైదానం నుండి తరిమేసారు.
(2) అదే దీక్షా శిబిరం నుండి అన్నా మద్దతుదార్లు 'ఆరక్షణ్' సినిమాకి మద్దతుగా, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. ఇంతకన్నా యింకేమి సాక్ష్యం కావాలి, అన్నా టీం అసలు ఉద్దేశాలు, ప్రణాళికలు అర్థం చేసుకోటానికి? అసలు 'అవినీతి' అంటే ఏమిటి? లంచగొండితనమే అవినీతా? రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకి లాభదాయకమైన ధర నిర్ణయించకుండా, గిట్టుబాటు ధర నిర్ణయించటం, పారిశ్రామిక వేత్తకి తన సరకు ధర తాను నిర్ణయించుకునే హక్కునివ్వటం, ప్రభుత్వాల చట్టబద్ధ అవినీతి కాదా? గ్రామ స్వరాజ్యం గురించి మాట్లాడే మన అపర గాంధీగారు తన ప్రాంతంలోని రైతుల ఆత్మహత్యల గురించి ఏనాడైనా రిలే నిరాహార దీక్ష అయినా చేసాడా? అవినీతి పెరిగిపోతున్నమాట వాస్తవం.
దానికి కారణమైన దోపిడీని, ఒక కల్చర్గా, కళగా అభివృద్ధి చేసిందెవరు? చాతుర్వర్ణ వ్యవస్థలో అగ్రభాగాన ఉన్న ప్రాబల్య కులాలు కాదా? వేల, లక్షల కోట్ల అవినీతికి పాల్పడే మైనింగ్ మాఫియాని, రాజకీయ కుబేరుల్ని, 10 రూపాయలు లంచం తీసుకొనే ట్రాఫిక్ కానిస్టేబుల్ని అవినీతిలో ఒకేగాటన కట్టటంలో ఉన్న నీతి ఎంత? అన్నా హజారే బృందానికి, సంఘ్ పరివార్ గ్రీన్ రూమ్ ఆపరేటర్స్కి 'అవినీతి' అనే తేలికపాటి ఆయుధం ఎందుకు అవసరమొచ్చింది? మల్టీనేషన్ కంపెనీలకు ఈ శతాబ్ధారంభంలో వరల్డ్ సోషల్ ఫోరమ్ని ఆరంభించవలసిన ఆగత్యమెందుకొచ్చిందో, ఈ దేశంలోని దోపిడి పాలక కులాలకు "అవినీతి వ్యతిరేక పోరాటమనే'' ఆయుధం అందుకే అవసరమొచ్చింది.
ప్రపంచీకరణకు ప్రత్యామ్నాయం లేదన్న మార్కెట్ వేదాన్ని, నినాదంగా మార్చినవాళ్ళే మార్కెట్ శక్తుల్ని ఎదుర్కొంటామని నమ్మబలికి ప్రపంచ సామాజిక వేదిక (వరల్డ్ సోషల్ ఫోరమ్) 21వ శతాబ్దారంభంలో ఏర్పాటు చేశారు. అది సగటు ఆశావాదికి సగటు ఆనందాన్ని కలిగించింది. 2004లో హైద్రాబాద్ (ఇండియా) ప్రపంచ సామాజిక వేదిక జరిపిన రెండు రోజుల సదస్సులో ఏఏ శక్తుల్ని ముందుంచి, ఏఏ శక్తులు వెనకుండి నడిపాయో, అర్ధమయ్యే నాటికి అవాక్కయ్యింది బాధ్యతాయుత పౌరసమాజం.
ప్రపంచీకరణ, సరళీకరణ మూడవదశలో చేరేందుకు సన్నద్ధమౌతున్న ప్రస్తుత తరుణంలో వరల్డ్బ్యాంక్, ఐ.యం.యఫ్ లాంటి పెట్టుబడిదారీ సంస్థలకు ఎన్జీవోల వంటి 'సమ్మతి తయారీ ఫ్యాక్టరీలు' అణగారిన జనాన్ని ఆశించినంతగా ప్రభావితం చేయలేకపోతున్నాయని గుర్తించారు. కొత్త ఫార్ములా వెదికారు. ఆ ఫార్ములానే మైఖేల్ చోసుదొ వస్కీ నిర్వచించిన మ్యానుఫాక్చరింగ్ డిసెంట్ (అసమ్మతి తయారీ) సిద్ధాంతం.
అంటే విద్యార్థులు తమ న్యాయమైన డిమాండ్ల కొరకు శాంతియుత ఊరేగింపులు తీస్తుంటే ప్రభుత్వ పెద్దలే అందులో చేరి వారికి నాయకత్వం వహిస్తున్నట్లు నటించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలిస్తూ చివరకు ఆ ఉద్యమాన్ని నీరుగార్చటం; 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని మర్రి చెన్నారెడ్డి వంటి వారు, హైజాక్ చేసి చివరకు పదవులు తీసుకొని ఉద్యమాన్ని చల్లార్చటం; రాజకీయ పార్టీలు, ఎస్.సి.సెల్, బి.సి. సెల్, ఎస్.టి. సెల్, మైనారిటీ సెల్ పెట్టి ఆయావర్గాల్లో వస్తున్న చైతన్యానికి అడ్డుకట్ట వేయించే కుతంత్రాలకి పాల్పడటం; దోపిడికి గురయ్యే వర్గాల తరపున దోపిడికి పాల్పడే వర్గాలు ముందుగానే దోపిడీకి వ్యతిరేకంగా ఊరేగింపులు, ధర్నాలు, నిరాహార దీక్షలు చేయటం ప్రారంభించి కంటితుడుపు చట్టాల్ని, అగ్రిమెంట్లని చేసి అసలు సమస్యను పక్కదోవ పట్టిస్తారు.
ఈ రోజు 'అవినీతి' అనే అంశాన్ని అందరూ అసహ్యించుకొనే స్థాయికి పెంచింది వీళ్ళే. దాన్నే ఆయుధంగా మార్చుకొని, అన్నా హజారే లాంటి గాంధేయ వాదిని రాలేగాంసిద్ధి గ్రామ జమ్మిచెట్టు నుండి దించి రాంలీలా మైదానంలో ప్రదర్శనకి పెట్టారు. 600 మందికి పైగా తెలంగాణ విద్యార్ధి యువకులు చనిపోతున్నా నోరెత్తని అన్నాజీ, ఖైర్లాంజీ కిరాతకాన్ని పట్టించుకోని గాంధేయుడు, అరుంధతీరాయ్ అన్నట్లు, మైనింగ్ మాఫియా గురించి గాని, సెజ్ల గురించి గానీ, గ్రీన్ హంట్లో ఆదివాసీల్ని అంతంచేస్తున్నపుడుగాని, సింగూర్, నందిగ్రాం ఉద్యమాలనుగాని, పోలవరం, నర్మదా డ్యాంలకు వ్యతిరేకంగా ప్రజాందోళనల్నిగాని పట్టించుకోని అన్నాజీ, రాలేగాం సిద్ధి చుట్టుపక్కల గ్రామాల్లో అందరి ఇళ్లలో సావర్కర్, ఫోటోలను పెట్టించే విప్లవాత్మక కార్యక్రమాన్ని, అమలుచేస్తూ అపర సంఘపరివార్ అనధికార సుప్రీంలా భారత రాజకీయ చిత్రపటం మీదికి అదాటుగా ఎలా వచ్చాడనేది అంత రహస్యమేమి కాదు.
జనలోక్పాల్ బిల్లు గురించి ప్రధానమంత్రిని బిల్లులో ఉంచాలా లేదా అన్నది అసలు సమస్యేనా? ఈ రోజు పి.యం.ఓ., సి.యం.ఓ., పార్లమెంటుని కూడా ప్రభావితం చేయగలిగే శక్తి కార్పొరేట్ సంస్థలకున్నదన్న విషయం అన్నాజీకి ఆయన భజన బృందానికి తెలియదా? భారత్లోనే మినీ భారత్లను సృష్టించుకుని, చట్టాల కతీతంగా దోపిడీ కొనసాగిస్తూ, అణు ఒప్పందంలో ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులకు ఒక్కొక్కరికి 30-40 కోట్ల రూపాయలు లంచంగా యిచ్చి ఇండియాని అమెరికాకు తాకట్టు పెట్టే బిల్లును నెగ్గించుకున్నప్పుడు అంత మొత్తం డబ్బుని ఏఏ కార్పొరేట్ శక్తులు సమకూర్చాయో ఈ గాంధేయ రుషికి తెలియదా? కిరణ్బేడి బెహన్జీకి, అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, కార్పొరేట్ డాక్టర్ ట్రెహన్లకు తెలియదా?
అన్నింటికన్నా ముఖ్యమైన రెండు విషయాలు ఆలోచించాల్సినవి.
(1) రెండు నెలల క్రితమే రామ్లీలా మైదానంలో సెప్టెంబర్ 1వ తారీకున బామ్సెఫ్ (బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీ ఎంప్లాయీస్ ఫెడరేషన్), ఒబిసి జనాభా లెక్కల విషయంలో జరుగుతున్న జాప్యానికి వ్యతిరేకంగా పెద్ద ర్యాలీని తలపెట్టి ప్రభుత్వ అనుమతి పొందింది. అదే రామ్లీలా మైదానాన్ని, అన్నాకు సెప్టెంబర్ 3 వరకు ప్రభుత్వం ఎందుకు అప్పగించింది? ఒబిసి సెన్సస్ విషయంలో అన్నా టీం స్పందన ఏమిటి?
(2) రామ్లీలా మైదానంలో రిజర్వేషన్ వ్యతిరేక నినాదాలు ఎందుకు, ఎవరిచ్చారు? గుజరాత్లో ముస్లిములను ఊచకోత కోసినపుడు మాట్లాడని అన్నాబృందం, మండల్ కమిషన్ని వ్యతిరేకించిన ఆధునిక మనువాదులు, వేదాంత, పోస్కోలాంటి మల్టీనేషన్ మైనింగ్ మాఫియాని వ్యతిరేకించని మినీభారత్ నిర్మాతలు, 'అవినీతి' అనే అంశాన్ని తీసుకొని కాషాయ కూటమికి అనుకూలంగా, మైనార్టీలకు వ్యతిరేకంగా ఒక సైన్యాన్ని ఎందుకు తయారుచేస్తున్నట్లు? రాజ్యాంగేతర వ్యవస్థని ఎందుకు కోరుతున్నట్లు? 80 కోట్ల జనాభా సమస్య ఆహార భద్రత విషయంలోను, ఆదివాసీల మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న ఆపరేషన్ గ్రీన్హంట్ విషయాన్ని పట్టించుకోని అన్నాజీ, భారత ప్రజల మెస్సయ్య ఎలా అవుతాడు? తెలంగాణ యువకుల ప్రాణత్యాగాల్ని పట్టించుకోని ఈ దేశ మీడి యా, ప్రజల్ని మాస్ హిస్టీరీయోకెందుకు ఉసిగొల్పుతోంది.
అణచివేయబడుతున్న కులాలు, విద్యార్ధులు, మేధావులు ఆలోచించాలి!
అన్నాటీం ఈ అంశాలకు జవాబు చెప్పాల్సి ఉంది. (1) దేశంలో అవినీతికి పాల్పడుతున్నది ఏఏ వర్ణాలు / కులాలు? (2) స్విస్బ్యాంకుల్లో లక్షల కోట్ల రూపాయలు దాచింది ఏఏ కులవర్గాలు? (3) నూటికి 90 శాతంగా ఉన్న శ్రామిక కులాలు అవినీతికి బాధ్యులా? లేక నూటికి 10 శాతంగా కూడాలేని దోపిడీ కులాలు అవినీతికి బాధ్యులా? (4) తమ చుట్టూ ఉన్న కార్పొరేట్ మీడియా, కార్పొరేట్ సంస్థలు, రాజకీయ నాయకులు అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనటానికి అర్హులేనా? (5) మండల్ కమిషన్కి వ్యతిరేకంగా రిజర్వేషన్లకి వ్యతిరేకంగా నినదించిన ఈ గొంతులే కదా దొంగ, దొంగ అని అరుస్తున్నది. (6) ఒక అవినీతి సామ్రాజ్యానికి వ్యతిరేకంగా, యింకో అవినీతి సామ్రాట్టు నినదించటంలోని రహస్యం అసలైన అవినీతి పరులు బయట పడకుండా ఉంచటానికేనా? అడాల్ఫ్ హిట్లర్ తాను యుద్ధంలో ఓడిపోతున్న విషయం రూఢి అయిన తర్వాత ఆత్మహత్యకు సిద్ధం అవుతాడు.
ఆ చివరి క్షణాలలో ఇంగ్లాండ్ ప్రీమియర్కు, అమెరికన్ ప్రెసిడెంట్కు ఒక వర్తమానం పంపుతాడు. ఆ వర్తమాన మేమంటే "నేను మీకు (పెట్టుబడి దారులకు) చేసే చివరి సేవ ఒక్కటే! మీరు ఇప్పటికైనా యుద్ధంలో చురుకుగా పాల్గొని కమ్యూనిస్టుల నుండి యూరప్ను రక్షించండి''. అన్నాజీ! 74 సంవత్సరాల వయస్సులో కూడా నమ్మిన మనువాద గాంధీ సిద్ధాంతానికి అంకితమై ప్రాణత్యాగానికి సిద్ధమైన మీ దీక్షా దక్షతలకు జోహార్లు! మీ వెన్నంటి ఉన్న అపర కుబేరులకు జేజేలు!! మీ దీక్షా దక్షతలను కనీసం 100 కోట్ల పౌరులకు బట్వాడా చేసిన కార్పొరేట్ మీడియాకు వేల వేల దండాలు!!!
- డా.యం.యఫ్. గోపీనాథ్
Sunday, May 15, 2011
హంతకుడెవరు? - డా.యం.ఎఫ్.గోపినాథ్
"ఈదేశానికింత చెడ్డ పేరు రావటానికి కారణం మీరా మేమా? ఆలోచించుకోండి. ఒకప్పుడిది మంచి దేశమని లోకానికి తెలుసు. మళ్ళీ దీనికి మంచి పేరు రావాలి. ఇంత అపఖ్యాతికి కారణం ఎవరు? - టటాంకా యెటాంకా, రెడ్ ఇండియన్స్ నాయకుడు పంజాబ్లో అకాలీద ళ్ని బలహీన పర్చటానికి నెహ్రూ కాలం నుంచి అనేక ప్రయత్నాలు జరిగాయి. 1980 ప్రథమార్ధంలో ఇందిరాగాంధీ అకాలీదళ్ కంటిని సిక్కుల కత్తితో పొడవటానికి భింద్రన్వాలేని బలోపేతం చేశారు.
1984లో భింద్రన్వాలే అమృత్సర్లోని స్వర్ణాలయాన్ని ఆయుధాగారంగా మార్చివేశాడు. ఇందిరా గాంధీ విజ్ఞప్తులు, ఆదేశాలనుఖాతర్ చేయలేదు. దీంతో అతనికి వ్యతిరేకంగా ఇందిర ''ఆపరేషన్ బ్లూస్టార్'' నిర్వహించారు. ఆ సైనిక చర్యలో భింద్రన్వాలే హతమయ్యారు. తిరిగి భింద్రన్వాలే శక్తి ఇందిరని హతమార్చింది. గల్లీల్లో గూండాలను తయారుచేస్తుందని, మాఫియా గ్యాంగుల్ని పెంచి పోషిస్తుందని తమ కనుకూలంగా పనిచేస్తే ఫ్రీడమ్ ఫైటర్స్ అని, వాళ్ళే విభేదిస్తే టెర్రరిస్టులుగా నామాంతరం చెందుతారని, ఎంతటి నీచానికైనా దోపిడి పాలక వర్గాలు పాల్పడతాయనే విషయాన్ని ఇందిరాగాంధీ నిరూపించారు.
1979లో సోవియట్ సైన్యాలు అఫ్ఘానిస్తాన్ను ఆక్రమించాయి. రష్యన్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న అఫ్ఘాన్ ముజాహిద్దీన్లకు అమెరికా సహాయం చేయటం మొదలుపెట్టింది. ఫ్యూడల్ దొరలు ఒక్కోసారి గొప్పలు పోవడానికి, తమపేరు శాశ్వతంగా నిలబడడానికి ఉదారంగా సహాయం చేస్తారు. కానీ పెట్టుబడిదారుడు ఎట్టి పరిస్థితుల్లోనూ లాభం లేకుండా సహాయం చేయడు. అమెరికా లాంటి విధ్వంసక కాపిటలిజం చేసిన రహస్య సహాయం 300 కోట్ల డాలర్లు.
అంటే 15,000 కోట్ల రూపాయలు. ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అఫ్ఘానిస్తాన్లో అప్పుడు సి.ఐ.ఎ ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తున్న మిల్టన్ బియార్డన్ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. రష్యన్లకు వ్యతిరేకంగా, 3 బిలియన్ డాలర్ల సహాయం అందించే ఉదార స్వభావం అమెరికా పెట్టబడిదారుల కెందుకుంది? కత్రినా సైక్లోన్లో తిండి దొరక్క తంటాలు పడ్డ న్యూఆర్లియన్స్ ప్రాంత అమెరికన్ పౌరులకే రొట్టె ముక్కలు కూడా ఉచితంగా అందివ్వని అమెరికన్ పాలకవర్గం అంత పెద్ద మొత్తాన్ని అఫ్ఘాన్లో పోరాడుతున్న ముజాహిద్దీన్లకు ఎందుకు ఖర్చు పెట్టినట్టు? ఒసామాబిన్ లాడెన్ అపుడు అఫ్ఘాన్ల తరపున అఫ్ఘానిస్తాన్ లోనే పోరాడుతున్నాడు! ఒసామాని అఫ్ఘాన్ ప్రజలు 'పవిత్ర మానవుడు' అని పిలుచుకుంటున్నారు.
ఆ 3 బిలియన్ డాలర్లు ఒసామాకి అందజేయలేదని, 'ఆ రహస్య సహాయాన్ని' ఒసామా అందుకోలేదని చరిత్రలో సాక్ష్యాలు దొరకుతాయా? ఈ రోజు కాకపోతే రేపైనా! సరే, ఒసామా గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. మహ్మద్ అపద్ బిన్ లాడెన్ అనే యెమన్ దేశస్థుడుకి ఎలియా ఘానెమ్ అనే సిరియా దేశస్థురాలికి 1957, మార్చి 10న సౌది అరేబియాలోని రియాద్లో పుట్టిన ఏకైక సంతానం ఒసామా. సముద్రతీరంలోని పోర్టులో కూలీ పనిచేసిన అపద్ బిన్ లాడెన్ సౌదీకి వచ్చి మక్కా మదీనాలకు మరమ్మత్తు, సౌదీ రాయల్ ప్యాలేసులను అతి తక్కువ ఖర్చుతో కట్టి, సౌదీ రాజ కుటుంబాలకు అతి సన్నిహితంగానే కాదు, సౌదీ రాజరిక వ్యవస్థలో మంత్రిగా కూడా పనిచేసాడు.
సౌదీలోనే అతిపెద్ద నిర్మాణరంగ కంపెనీకి అధిపతి అయి, అతికొద్దిమంది ధనికుల్లో ఒకడైనాడు. ఒసామాకి రెండు సంవత్సరాల వయస్సున్నపుడే తల్లిదండ్రులు విడిపోయారు. ప్రఖ్యాతిగాంచిన అల్ ధాగర్ మోడల్ స్కూలులో చదువు. ఆ తరువాత ఇంజనీరింగ్ చేసిన ఒసామా ప్యూర్ ఇస్లామ్కి (సౌభ్రాతృత్వానికి) విధేయుడుగా పెరిగాడు. 14 సంవత్సరాల వయస్సులోనే ఖురాన్ మత గ్రంధాన్ని కంఠస్తం చేసి, లైఫ్స్టైల్లో, డ్రెస్కోడ్లో మహమ్మద్ ప్రవక్తని అనుకరించిన మితభాషి.
స్కూల్లో, కాలేజీలో అవుట్ స్టాండి ంగ్ విద్యార్థిగా పేరు పొందాడు ఒసామా. తన తండ్రి వ్యాపార లావాదేవీల కారణంగా, ఆయన ప్రతి సంవత్సరం ఆర్గనైజ్ చేసే హాజ్ యాత్రల వలన కూడా అరబ్ ప్రపంచంలోని ధనికులతో, ఇస్లామిక్ స్కాలర్స్తోనూ ఒసామాకి పరిచయాలేర్పడ్డాయి. మితభాషి, ఇస్లామిక్ నియమనిష్ఠలతో పెనవేసికొని పోయిన ఈ బక్క పల్చటి వ్యాపారస్తుడిని 1979లో అఫ్ఘానిస్తాన్లోకి దూసుకు వచ్చిన రష్యన్ సోషల్ ఫాసిస్ట్ సేనల దుశ్చర్యలకు బలైపోతున్న తోటి అఫ్ఘాన్ ముస్లిమ్ ప్రజల కష్టాలు, కన్నీళ్ళు కదిలించి వేసాయి.
అదే సమయంలో తోటి ముస్లిమ్ సహోదరులకు సాయం చేయమని సౌదీ రాజుల్ని అర్ధించి, విఫలమవుతున్న క్రమంలో శవాల్ని పీక్కుతినే రాబందులుగా ఎదురుచూస్తున్న అమెరికా ( తన జాతీయ జెండాలో రాబందు (ఈగిల్)నే సింబాలిక్గా పెట్టుకుంది!) రహస్య పోలీస్ (సిఐఏ , నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ద్వారా) అఫ్ఘాన్లోని తిరుగుబాటుదారులకి 'రహస్య సహాయంగా 3 బిలియన్ డార్లని అందించటానికి తయారుగా కాచుక్కూచుంది.
ముల్లా ఒమర్ నాయకత్వంలోని ముజాహిద్దీన్లకి ఈ రహస్య సహాయాన్ని అందించిందని, అప్పుడే ఎదుగుతున్న, పెరుగుతున్న ఒసామా బిన్ లాడెన్ గురించి అమెరికన్ గూఢాచారులకు, వాళ్ళ వాషింగ్టన్ బాస్లకు తెలియదని, ప్రపంచ రాజకీయ పరిజ్ఞానం కొంచెమైనా ఉన్న వాళ్ళకు అర్థం కాదనటం పిల్లి పాలు త్రాగుతూ... అన్నట్లుంటుంది. ఈ విషాయాన్ని సి.ఐ.ఎ. ఆఫీసర్ మిల్టన్ బియార్డాన్ ధ్రువీకరించాడు కూడా.అఫ్ఘాన్ యుద్ధ శరణార్థులకు సౌదీ రాజులు సహాయం నిరాకరించిన తర్వాత చాలామంది ఉలేమాలు (ఇస్లామిక్ స్కాలర్స్) ఒసామా సహాయ ప్రతిపాదనలను అంగీకరించి, మద్దతు పలికారు.
అఫ్ఘాన్ ముస్లిమ్ అనాధల కొరకు రక్షణ వలయాన్ని, సౌదీ, సూడాన్, ఈజిప్ట్ తదితర దేశాల ముజాహిద్దీన్లతో ఏర్పర్చాడు ఒసామా. 1989లో రష్యన్ సైన్యాలు అఫ్ఘానిస్తాన్ నుండి వైదొలగిన తరువాత యుద్ధ భూమిలో ఒసామా అనుభవాలు, తన వ్యాపారాలను లక్ష్య పెట్టక అసలైన ఇస్లామ్లోని సౌభ్రాత ృత్వానికి (బ్రదర్హుడ్)కి అంకితమయ్యాడు. పిల్లికి పిల్లికి మధ్య పోరుపెట్టిన.. చందంగా అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికా అవలంబిస్తున్న నీతి మాలిన దౌత్యాన్ని అర్థం చేసికొన్నాడు. అమెరికా పట్ల, ద్వేషం పెంచుకున్నాడు.
పది సంవత్సరాలు కొనసాగిన ఇరాన్-ఇరాక్ యుద్ధంలోను, పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని పెంచిపోషించటంలోను, లాటిన్ అమెరికన్ దేశాల్లో ప్రజాద్రోహుల్ని తమ కీలు బొమ్మలుగా ప్రతిష్ఠించి, ఆయా దేశాల్లోని సహజ సంపదల్ని దోచుకొని, జాక్ లండన్ తన "ఉక్కుపాదం'' పుస్తకంలో వివరించినట్లు, అమెరికన్ కార్మికులకి అధిక మొత్తంగా జీతాలు చెల్లిస్తూ ప్రపంచ దేశ ప్రజల్ని తన పాదాక్రాంతం చేసికొనే ప్రణాళికలో ఇదంతా భాగమేనని ఒసామా అర్థం చేసుకున్నట్లు కనిపిస్తుంది.
అమెరికన్ పాలకులు 1990 నుంచి ఒక వింతైన సిద్ధాంతాన్ని ప్రచారంలో పెట్టారు. 'మేము (అమెరికా) ప్రపంచంలో ఎక్కడైనా, ఏ దేశాన్నైనా ప్రజాస్వామ్యం ముసుగులో దోచుకునే అర్హత మాకు ఉన్నది. మాకు మద్దతిచ్చే దేశాలు మాకు మిత్రులు, కాదన్నవాళ్ళు ఉగ్రవాదులు'' అనేదే ఆ సిద్ధాంతం. ఇదీ అమెరికన్ ఇంపీరియల్ టెర్రరిస్టుల అంతర్జాతీయ దౌత్యనీతి. ఇది ఎలా ఉన్నదంటే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, ఆ రాష్ట్ర ప్రజలకి ఒక స్పష్టమైన తాఖీదులిచ్చింది.
"ఉంటే సల్వాజుడుంలో సభ్యులుగా ఉండండి. లేదంటే మీరంతా మావోయిస్టులే. కాబట్టి మీరు చంపబడడానికి, రేప్ చేయబడడానికి మీ గూడేలు, గుడిసెలు తగలబెట్టబడటానికి అర్హత పొందుతారు'' అన్నది. మాకు బతకటానికి స్వేచ్ఛ కావాలనే ప్రతి ఒక్కడు, ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి, టెర్రరిస్ట్గానో, మావోయిస్టుగానో కనపడతాడు. కాషాయ వస్త్రధారుడైన స్వామి అగ్నివేష్ కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి మావోయిస్టుగానే కనపడినందు వల్లనే ఆయన మీద దాడి జరగడం గమనించాలి.
రష్యన్లు అఫ్ఘానిస్తాన్పై చేసిన దాడిని సాకుగా తీసుకొని అమెరికన్ గూఢచారి వ్యవస్థ "ఆపరేషన్ సైక్లోన్'' పేరుతో అఫ్ఘాన్ తిరుగుబాటుదారులకి 3 బిలియన్ డాలర్ల రహస్య నిధిని ఏర్పాటు చేసింది. అప్పటికే అఫ్ఘాన్ నాయకుల మీద నమ్మకం సడలిన ఒసామా తన పవిత్ర యుద్ధాన్ని (జిహాద్) ప్రారంభించాడు. అప్పుడు అమెరికన్ గూఢచారి వ్యవస్థలు (సి.ఐ.ఎ., అమెరికన్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీలు) ఒసామా లాంటి కాబోయే ప్రపంచ ఉగ్రవాదిని వదులుకుంటాయా? ఇందిరాగాంధీ భింద్రన్వాలేని ఒదులుకోనట్లు, అమెరికా 1980లో ఒసామాకి కావల్సినంత సహాయం చేసి, రష్యన్ సైన్యాలు 1989లో అఫ్ఘానిస్తాన్ని వదిలిన తర్వాత గల్ఫ్లోని ఇరాక్, కువైట్ ప్రాంతాల్లోని చమురు నిక్షేపాల్ని దోచుకోవటానికి ఉపయోగించుకుందామనుకుంది.
ఒకవైపున ఇజ్రాయేల్ని ముస్లిమ్ దేశాలపైకి ఉసిగొల్పుతూ, మరోవైపు సౌదీ అరేబియా రాజరిక వ్యవస్థను గుప్పెట్లో పెట్టుకుని, ఇరాక్లో సద్దాంని శిక్షించటానికి ఒసామాని ఉపయోగించుకుందామనుకుంది అమెరికా. కానీ ఒసామా అమెరికాని ధిక్కరించాడు. అఫ్ఘాన్లో 1982-89 వరకు ముజాహిద్దీన్లకు సహాయపడ్డ ఒసామా 1986లో తన పర్యవేక్షణలో పనిచేసే జిహాద్ని ప్రార ంభించాడు. 1988 నాటికి అల్ఖైదా, అంటే 'ది బేస్' అనే అంతర్జాతీయ జిహాది సంస్థను ఏర్పర్చాడు.
అఫ్ఘానిస్తాన్ నుంచి సోవియట్ సైన్యాలు వైదొలిగిన తరువాత సౌదీకి ఒబామా వెళ్తే అమెరికన్ పాలకుల ఆదేశాల మేరకు సౌదీ రాజరిక వ్యవస్థ ఒసామాని హౌజ్ అరెస్ట్ చేసి, అతని అంతర్జాతీయ ప్రయాణాల్ని నిషేధించింది. అతని జిహాద్లో ఎక్కువమంది సౌదీ అనేబియన్లు, ఈజిప్షియన్లు, యెమెన్, లిబియా, సూడానీయులు, అఫ్ఘాన్లు, పాకిస్తానీయులు, కాశ్మీరీలు, ఇండియన్లు ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత హింసాత్మక సంఘటలకు పాల్పడుతుంది అమెరికానే అని 40 సంవత్సరాల క్రితమే నల్లజాతీయుల నేత మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అమెరికా గడ్డ మీదనే నిలబడి నిలదీశాడు. రూజ్వెల్ట్, కెనడీ, జిమ్మి కార్టర్ నుంచి రోనాల్డ్ రీగన్, జార్జిబుష్ సీనియర్, బిల్ క్లింటన్, బుష్ జూనియర్, యిపుడు ఒబామా, ఎవరైతేనేమి ఒక్కొక్కడు మహా హంతకుడనే విషయాన్ని చరిత్ర రికార్డు చేస్తూనే ఉంది. అనేక వందల వేల యుద్ధాల్ని చూచిన ప్రపంచ ప్రజల చరిత్ర ఇప్పుడు ప్రశ్నిస్తుంది.
హంతకులెవరు? నరహంతకులు ధరాధిపతులైన వేళ గౌతమ బుద్ధులకి, ఏసుక్రీస్తులకి స్థానమెక్కడ ఉంటుంది? అణిచివేత నుంచి నిరాశ, నిరాశ నుంచి నిరసన, నిరసన నుంచి ధిక్కారం, ధిక్కారానికీ దిక్కు లేకపోతే.. ? టెర్రరిజమే దిక్కవతుందన్నది గతి తర్కం. ఒసామా విషయంలో హంతకుడు ఒక నామవాచకాన్ని మాత్రమే రూపుమాపాడు; ఆ హతుడు సర్వనామమనే విషయాన్ని విస్మరించాడు. ఇది చాలు హంతక అమెరికాకు మరో భంగపాటు సమీప భవిష్యత్తులో కలగటానికి..
Tuesday, March 29, 2011
Monday, March 21, 2011
INVITATION
Date: 21-Nov-2010; Time 10 am to 6 pm; Venue: Hall No. 1, New Academic Block, EFL- University
It is the time to think and probe seriously in to the issue of caste in understanding the nature and scope of the social and political system in India. Observing and experiencing the conflicting interests in the emerging political demands, we the Organizers feel the necessity to debate a day long Discussion on “Caste and its Role in Indian Social Transformation”
We are inviting speakers from different social and political backgrounds (Social activists, Thinkers and academicians) to present papers and debate this issue seriously, to come out with a critical analysis regarding the origin of caste and its consequences in Indian Social, economic, political and cultural spheres.
Organized by:
TSA EFL University and Phule-Ambedakar National Institute of Social sciences & Movements
Organizing Committee:
Dr. M. F. Gopinath MD; DM (Cardiologist)
Kotesh Devulapally PhD (Translation Studies)
Gurram Seetaramulu PhD (Translation Studies)
Sunday, March 20, 2011
Subscribe to:
Posts (Atom)